logo

నంద్యాల అభివృద్ధి శిల్ప కుటుంబ తోనే సాధ్యం: నాగిని రవి సింగారెడ్డి.

నంద్యాల జిల్లా (తెలుగు న్యూస్): నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డు ఎన్జీవోస్ కాలనీలో వార్డు కౌన్సిలర్ దేశం సులోచన (మాజీ మున్సిపల్ చైర్ పర్సన్) ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం కొనసాగించారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపునకు మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే గా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరిస్తూ ఓట్ల అభ్యర్థించారు..ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో శిల్ప కుటుంబం చేసిన అభివృద్ధి తప్ప తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనపడలేదన్నారు అదేవిధంగా నంద్యాలలో మా సొంత నిధులతో శిల్పా సేవాసమితి ద్వారా మహిళలకు పావులా వడ్డీ రుణాలు చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అదేవిధంగా శిల్పా మినరల్ వాటర్ వైయస్సార్ గల్లీ దావకాన ఏర్పాటు చేశామన్నారు తెలుగుదేశం నాయకులు వాటిపై కూడా బురద జలుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడైన ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారని ప్రశ్నించారు...

మే 13 వ తారీకు జరగబోవు ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేయుచున్నారని వారికి మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించవలనీ ప్రజలను కోరారు...

ఈ కార్యక్రమంలోకౌన్సిలర్లు మురళి నారాయణమ్మ, వార్డు వైసిపి నాయకులు, గోపాల్ రెడ్డి నారాయణ రెడ్డి నరసింహారెడ్డి జగదీశ్వర్ రెడ్డి మోహన్ రెడ్డి , గాలి రెడ్డి,రెడ్డి ,వెంకటేశ్వర్ రెడ్డి, చింతకుంట్ల రవి

0
0 views